సౌత్ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పరిచయం అవసరం లేని పేరు.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది.
మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యింది.తన అందం, నటన తో కుర్రకారు మనసును దోచుకుంది.
మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోవడంతో తన కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.
వెంటనే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో అవకాశం వచ్చిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో తెలుగులో మరొక సినిమాలో నటించలేదు.
ఆ తర్వాత ఈ బ్యూటీ ఫోకస్ అంత బాలీవుడ్ మీద పెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ అయ్యింది.వరుస ఛాన్స్ లు అందుకుంటూ స్టార్ స్టేటస్ అనుభవిస్తుంది.
కబీర్ సింగ్ విజయంతో ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన మరొక సారి ఛాన్స్ అందుకుని హాట్ టాపిక్ అయ్యింది.శంకర్ తో తీస్తున్న పాన్ ఇండియా సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా కియారా అద్వానీ మీద కొన్ని రూమర్స్ వస్తున్నాయి.
కియారా కు అహంకారం ఎక్కువని గర్వంతో ప్రవర్తిస్తూ అవకాశాల్ని కూడా వదులుకుంటుంది అంటూ బాలీవుడ్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
అయితే కియారా తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించింది.కియారా మాట్లాడుతూ.నాకు ఎలాంటి అహంకారం లేదు.
అలా ఉంటే ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా వస్తాయి అంటూ కౌంటర్ ఇచ్చింది.నేను ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎంతో కష్టపడి నటిగా గుర్తింపు తెచుకున్నానని అలా అహంకారమే ఉంటే సినీ అవకాశాలు అందుకోలేనని ఈ విషయం రాస్తున్న వాళ్లకు కూడా తెలుసనీ మనుషుల వ్యక్తిత్వాలు తెలుసుకుని రాయాలని ఆమె అసహనం వ్యక్తం చేసారు.