టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించినటువంటి భరత్ అనే నేను చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఆడిపాడినటువంటి కియారా అద్వానీ టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.అయితే ఈ అమ్మడు ఒకపక్క టాలీవుడ్ లో నటిస్తూనే మరో పక్క బాలీవుడ్లో కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
అయితే తాజాగా ఈ అమ్మడు మీటూ ఉద్యమంపై చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి.
తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీటూ ఉద్యమం వల్ల తాను ఆశించిన ఫలితాలు రాలేదని, అంతేగాక ఇప్పటికీ పలువురు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.అయితే ఎప్పుడు ఇలాంటి విషయాలపై ప్రస్తావించిన కియారా అద్వానీ ఒక్కసారిగా ఏకంగా మీటూ ఉద్యమం పైన మాట్లాడింది అంటే అందుకు తగ్గ బలమైన కారణాలు ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో కీరా అద్వానీ నటించినటువంటి గుడ్ న్యూస్ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అంతేగాక ఇందో కి జవానీ, షేర్ షా, లక్ష్మీ బాంబ్, భూల్ భులయ్యా, అనే మరో నాలుగు చిత్రాల్లో కూడా నటిస్తోంది.ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న టువంటి మహేష్ బాబు చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.
.