బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియరా అద్వాని టాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది.మహేష్ తో భరత్ అనే నేను, రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలు చేసిన కియరా అద్వాని మళ్లీ చరణ్ తో జోడీ కడుతుంది.
చరణ్, శంకర్ కాంబినేషన్ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 8న స్టార్ట్ అవుతున్న సందర్భంగా కియరా అద్వాని హైదరాబాద్ చేరుకుంది.
హైదరాబాద్ లో కియరా హంగామా స్టార్ట్ అయ్యింది. బీ టౌన్ హాట్ హీరోయిన్ గా వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న కియరా అద్వాని తెలుగులో కూడా దూసుకెళ్తుంది.
శంకర్, చరణ్ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతుంది.ఈ సినిమాతో అమ్మడు తమిళ ఆడియెన్స్ కు పరిచయం అవుతుంది.శంకర్ సినిమాలో హీరోయిన్స్ చాలా అందంగా ఉంటారు.వారికి కథలో ప్రాముఖ్యత ఉంటుంది.
మరి చరణ్ 15వ సినిమాలో కియరా అద్వాని ఎలాంటి పాత్రతో మెప్పిస్తుందో చూడాలి.ఈ సినిమాతో కియరా క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుంది. సినిమా కోసం చరణ్ కొత్త లుక్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది.