బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ కియారా అద్వాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కియారా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోక్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటోంది.
ఇకపోతే ఈమె బాలీవుడ్ దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన 2016 చిత్రం MS ధోని: ది అన్ టోల్డ్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత కియారా మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు.
ఇక కియారరా అద్వానీకి సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందీ అన్న విషయం తెలిసిందే.
ఇక ఈమె కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకి అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే ఇటీవల కియారా ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ పెంపుడు కుక్క అయిన రైమ్ తో కలిసి దిగిన ఒక రేర్ పిక్ ని పంచుకున్న విషయం తెలిసిందే.
కియారా తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోను పంచుకుంటూ పుస్తకాల కోసం ఒకటి! ఉత్తమ అల్పాహారం తేదీ పావ్సోమీ.ఎల్లప్పుడూ రైమ్ అంటూ ఆ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ కథనాలలో కూడా పంచుకుంది.దానికి అందమైన క్యాప్షన్ ఇచ్చింది.ఈ రోజు ఒక అందమైన సహ ప్రయాణీకుడిని కలుసుకున్నాను అనే కాప్షన్ ను జోడించింది.ఇక ఆ ఫోటోలో విమానంలో కియరా ముందరి టేబుల్ పై ఆహారం ఉంది.పక్క సీట్లో పప్పీ కూర్చుని తననే చూస్తోంది.
ఈ ఫోటోపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల తనదైన శైలిలో స్పందించింది.