గద్దలకొండ గణేష్ చిత్రం తర్వాత వరుణ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సర్గా ఒక చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే.ఆ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీని సంప్రదించడం జరిగింది.
ఈ అమ్మడు తెలుగులో భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది.ఆ రెండు సినిమాల్లో కూడా అమ్మడి అందంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్లో చాలా బిజీగా ఉంది.
బాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేస్తున్న కారణంగా వరుణ్ తేజ్ మూవీకి నో చెప్పిందని వార్తలు వచ్చాయి.
అదే సమయంలో బారీ పారితోషికం డిమాండ్ చేసిందని, ఆరు నెలల సమయం కావాలంటూ ఆమె కండీషన్స్ పెట్టిందని కూడా ప్రచారం జరిగింది.మొత్తానికి వరుణ్ మూవీలో కియారా లేకుండానే మొదలు అయ్యింది.
ఇప్పుడు అదే కియారాను పవన్ కళ్యాణ్ కోసం దర్శకుడు క్రిష్ సంప్రదించినట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం క్రిష్ ఇటీవలే ముంబయి వెళ్లి మరీ ఆమెను కలిశాడట.
దర్శకుడు క్రిష్ అనుకున్న కథకు పవన్కు జోడీగా కియారా అయితేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యిందట.అందుకే కాస్త ఎక్కువ పారితోషికం అయినా కూడా ఇచ్చి ఆమెను బుక్ చేయాలనుకున్నారు.అలాగే చాలా తక్కువ డేట్లు ఆమె నుండి కోరినట్లుగా తెలుస్తోంది.తక్కువ డేట్లు ఎక్కువ పారితోషికం కనుక కియారా అద్వానీ ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ సినీ వర్గాల వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అధికారిక ప్రకటన అతి త్వరలోనే వెళువడే అవకాశం ఉంది.