దర్శక దిగ్గజం శంకర్ నెక్స్ట్ సినిమాని రామ్ చరణ్ తో చేయడానికి ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని రీసెంట్ గా అఫీషియల్ ఎనౌన్స్ చేశారు.
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోయే ఈ సినిమాని దిల్ రాజు ఏకంగా రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.
శంకర్ హిందీలో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు.విక్రమ్ అపరిచితుడు సినిమాని హిందీలో రణవీర్ సింగ్ తో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా రీమేక్ కోసం ఓ బడా ప్రొడక్షన్ హౌస్ రెడీ అయ్యింది.ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అపరిచితుడు సినిమా వచ్చింది.
ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకొని మరింత గ్రాండ్ గా ఆ సినిమాని శంకర్ రణవీర్ తో చేయాలని అనుకుంటున్నారు.ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని బోగట్టా.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న మోస్ట్ క్రేజీ హీరోయిన్ కియరా అద్వానీని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.కథ ఏంటో తెలియడంతో కియారా అద్వానీ కూడా నటించడానికి ఒకే చెప్పిందని బోగట్టా.
అయితే ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు ఫినిష్ అయిన తర్వాత ఈ సినిమాపై కియారా ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.రణవీర్ సింగ్ కూడా ప్రస్తుతం రోహిత్ శెట్టితో చేస్తున్న సినిమాని పూర్తి చేసిన తర్వాత శంకర్ సినిమా మీద దృష్టి పెడతాడని తెలుస్తుంది.
మరి ఈ టాలెంటెడ్ స్టార్ దర్శకుడు ముందుగా అన్నియన్ రీమేక్ స్టార్ట్ చేస్తాడా లేక రామ్ చరణ్ మూవీ స్టార్ట్ చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.