తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన “భరత్ అనే నేను” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “కియారా అద్వానీ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే ప్రిన్స్ “మహేష్ బాబు” వంటి స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని దక్కించుకోవడం మరియు భరత్ అనే నేను చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అవ్వడంతో సినిమా కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.
దాంతో కియారా అద్వానీ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన “వినయ విధేయ రామ” చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
దీంతో ఒక్కసారిగా కియారా అద్వానీ సినిమా భవిష్యత్తు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రశ్నార్థకంగా మారింది.
అయితే ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులు నిలిపివేయడంతో సెలవులను కియారా అద్వానీ బాగానే ఎంజాయ్ చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే కియారా అద్వానీ సముద్రంలో బికిని దుస్తులు ధరించి ఈత కొడుతుండగా తీసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ ఫోటోకి కియారా అద్వానీ “మనం అలలను ఆపలేకపోవచ్చు కానీ వాటి ద్వారా ఈత కొట్టడం నేర్చుకోవచ్చు” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.దీంతో ఈ ఫోటోని షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా పది లక్షల పైచిలుకు లైకులు, కామెంట్లు చేశారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు లేక పోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.కాగా ఆ మధ్య ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన “లక్ష్మీ” చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాల అవకాశాలు ఉన్నాయి.కాగా ప్రస్తుతం కియారా అద్వానీ తెలుగులో ప్రముఖ దర్శకుడు శంకర్ మరియు మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్ తేజ్” కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ ఇప్పటి వరకు కియారా అద్వానీ మాత్రం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.