సౌత్ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పరిచయం అవసరం లేని పేరు.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది.
మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి.కానీ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో కొన్ని రోజులు ఈ భామ సైలెంట్ అయ్యింది.
కానీ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు.అందుకే అందరు పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు ఉన్న భామ అయితే వాళ్ళ సినిమాకు కూడా ప్లస్ అవుతుందని ఆలోచిస్తున్నారు.
అయితే మన టాలీవుడ్ దర్శక నిర్మాతలకు కియారా నే ఛాయిస్ గా కనిపిస్తుందట.ఎందుకంటే ఈ బ్యూటీ కి బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.
అందుకే పాన్ ఇండియా సినిమా అనగానే ముందుగా కియారా నే అందరి ఛాయిస్ అయ్యింది.
ఇప్పటికే కియారా పలు క్రేజీ సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతుంది.శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న సినిమాలో కియారా నటిస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.వీరిద్దరూ కలిసి రెండవసారి తెరమీద నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు కొరటాల ఎన్టీఆర్ సినిమాలో కూడా కియారా పేరునే వినిపిస్తుంది.
ఇక తాజాగా మరొక పాన్ ఇండియా సినిమాలో ఈ బ్యూటీ పేరు వినిపిస్తుంది.వంశి పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో కూడా కియారా ను తీసుకోవాలని అని వంశీ చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సూపర్ స్టార్ విజయ్ తో అవకాశం అంటే కియారా వదులుకునే అవకాశం లేదు.అందుకే ఈ సినిమాకు కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.