యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటంగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్లో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని కూడా ఇప్పటికే ఓకే చేశాడు ప్రభాస్.మహానటి వంటి బ్లాక్బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తన నెక్ట్స్ చిత్రాన్ని ప్రభాస్తో చేయడానికి రెడీ అయ్యాడు.
ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సి.అశ్వినిదత్ భారీ బడ్జెట్తో నిర్మించనున్నాడు.అయితే సూపర్ హీరో కథతో ఈ సినిమాను నాగ్ అశ్విన్ చాలా ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దేందుకు రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ గత కొంతకాలంగా అన్వేషిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నించింది.అయితే ఆమె ఈ సినిమాలో నటించేందుకు అత్యంత భారీ రెమ్యునరేషన్ను డిమాండ్ చేయడంతో చిత్ర నిర్మాత వేరే హీరోయిన్ను వెతుకుతున్నారు.
ఈ క్రమంలోనే భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కియారా అద్వానీని తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.కియారా అయితే తక్కువ బడ్జెట్లో నటించేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
దీంతో ఆమెను సంప్రదించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాలో కియారా నిజంగానే ఈ సినిమాలో నటిస్తుందో లేదో చూడాలి.