బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైన అందాల భామ కియారా అద్వానీ ఆ తరువాత తెలుగులో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో మళ్లీ తెలుగులో సినిమానే చేయలేదు ఈ బ్యూటీ.
కాగా తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
తాను సినిమాల్లోకి వచ్చే ముందు తన పేరు ఆలియా అని, సినిమాల్లోకి వచ్చాక తన పేరును కియారా అని పెట్టుకున్నట్లు తెలిపింది.నిజానికి తనకు పుట్టబోయే కూతురికి ఆ పేరు పెట్టాలనుకుందట కియారా.
కానీ తన పెళ్లి ఎప్పుడవుతుందో తెలియదు కాబట్టి, బాలీవుడ్లో ఆలియా భట్తో తన పేరు కన్ఫ్యూజ్ కావద్దని తన పేరును మార్చానని చెప్పుకొచ్చింది.
ప్రియాంక చోప్రా నటించి ‘అంజానా అంజానీ’ సినిమాలో ప్రియాంక పేరు కియారా అని, అది తనకు చాలా నచ్చి తన పేరును మార్చుకున్నట్లు తెలిపింది.
ఇక తన సంపాదన మొత్తం తల్లిదండ్రులకే ఇస్తానంటోంది ఈ బ్యూటీ.ఇంతటి స్టార్ స్టేటస్ వచ్చినా కూడా ఇంకా తన తల్లిదండ్రులకే సంపాదన ఇవ్వడం నిజంగా గ్రేట్ అంటున్నారు సినీ ఆడియెన్స్.