తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన “భరత్ అనే నేను” చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ముంబై బ్యూటీ “కియరా అద్వానీ” గురించి తెలియనివారుండరు.ఈ అమ్మడు తన మొదటి చిత్రమే తెలుగులో స్టార్ హీరోతో నటించడంతో తదుపరి చిత్రం కూడా స్టార్ హీరోతో నటించింది.
అయితే తాజాగా ఈ అమ్మడు గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుతం కియారా అద్వానీ తెలుగు చిత్రాలలో నటించడానికి దాదాపుగా రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే ఈ అమ్మడు టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ పారితోషికం విషయంలో కొంతమేర విభేదాలు రావడంతో నిర్మొహమాటంగా నో చెప్పేసిందట.
దీంతో సినిమా బడ్జెట్ ని బట్టి పారితోషికం తీసుకుంటే బాగుంటుందని కొందరు సినీ విశ్లేషకులు కియారా అద్వానీ కి సూచిస్తున్నారు.
అంతేగాక ఏ ఇతర నటీనటుల అయినా సరే అన్నిసార్లు కూడా పారితోషకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దాదాపుగా చాలా చిత్రాలలో నటించే అవకాశాలు కోల్పోతారని కాబట్టి సినీ జీవితంలో రాణించాలంటే ఇటు నటన పరంగానూ అటు పారితోషకం పరంగానూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా కియారా అద్వానీ బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
ఏకంగా 4 చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేగాక తెలుగులో కూడా ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మరోమారు నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.