బాలీవుడ్లోనే కాక, టాలీవుడ్లోనూ మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ముంబై భామ కియారా అద్వానీ.చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటికి సంబంధించి తాజాగా వివాహం చేసుకుంటారనే వార్తలు వైరల్గా మారాయి.
అసలు ఈ వార్తలు ఇలా ప్రచారం కావడానికి కారణం ఏంటీ? అని చూస్తే.బాలీవుడ్ యంగ్ హీరో, ఆమె ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలే ఆధారాలుగా నిలుస్తున్నాయి.
గత కొంతకాలం నుంచీ వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న ఊహాగానాల గురించి తెలిసిన విషయమే.అయితే.షేర్షా మూవీ సక్సెస్తో మంచి జోష్ మీదున్న సిద్దార్థ్ మల్హోత్రా.తాజాగా తన పెళ్లి గురించి వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
వివాహం ఎప్పుడు ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ తానేమీ జ్యోతిష్యుడిని కానని, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నారు.ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే అందరికీ ఈ విషయం గురించి ముందే చెబుతానని సిద్దార్థ్ తెలిపారు.
దీంతో అతను తన గర్ల్ఫ్రెండ్ కియారాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడా ? అందుకే ఇలాంటి కామెంట్స్ చేశారా ? అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా కియారా గురించి ఆమె మల్హోత్రా చాలా గొప్పగా చెప్పారు.నటిగా కంటే ఆమె మంచి వ్యక్తి అని చెప్పుకొచ్చారు.ఆమెలో మార్చుకోవాల్సిన అంశాలేవీ లేవని, తనతో ఒక రొమాంటిక్ సినిమా చేయాలని ఉందని వ్యాఖ్యానించారు సిద్దార్థ్.మొత్తానికి సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లిపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి.కియారా పెళ్లి చేసుకోబోతోందా అనే చర్చ మొదలయ్యేలా చేసింది.
మరి ఈ వార్తలపై కియారా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.