ఏపీలో ఉన్న కియా కార్ల తయారీ ప్లాంట్ను తమిళనాడుకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ఒక కథనంను ప్రచురితం చేసింది.అయితే ఆ విషయాన్ని కియా కంపెనీ కొట్టి పారేసింది.
ఏపీ ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవు, కియా కార్ల కొత్త ఉత్పత్తులను ఏపీ ప్లాంట్లోనే చేయబోతున్నట్లుగా కియా కంపెనీ ఇండియా ప్రతినిధి ప్రకటించారు.అయినా కూడా మీడియాలో వార్తలు ఆగడం లేదు.
కియా కంపెనీ విషయం అంతర్జాతీయ స్థాయిలో వార్తలు రావడంతో పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఇప్పుడు వెనక్కు తగ్గుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమాత్రం సరిగా లేవని, ఆ కారణం వల్లే కియా కంపెనీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మేము పోయి కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అని కంపెనీలు భావిస్తున్నాయి అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.కియా వార్తల వల్ల రాష్ట్రం బ్రాండ్ మరింత పడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.