అతిలోక సుందరి శ్రీదేవి ముందుగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా జెండా పాతింది.ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది.
అయితే తన కూతుళ్ళని సౌత్ లో కూడా స్టార్స్ ని చేయాలనే ఆలోచన శ్రీదేవికి ఉంది.కాని ప్రస్తుతం జాన్వీ కపూర్ మాత్రం హిందీలో వరుస అవకాశాలు వస్తూ ఉండటంతో టాలీవుడ్ వైపు పెద్దగా దృష్టి పెట్టడం లేదు.
స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు వస్తున్న డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకుంటుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే అక్క బాటలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా హీరోయిన్ గా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతుంది.
అయితే ఈ బ్యూటీ బాలీవుడ్ కంటే ముందుగా సౌత్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో తండ్రి బోనీ కపూర్ కూడా ఇప్పటికే సౌత్ లో దర్శక, నిర్మాతలతో టచ్ లోకి వెళ్తున్నారని బోగట్టా.
బాలీవుడ్ లో అయితే కరణ్ జోహార్ ప్రొడక్షన్ ద్వారానే పరిచయం కావాలని ఖుషి కపూర్ కోరుకుంటుంది.అది కుదరకపోతే తెలుగులో స్టార్ హీరో సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అవ్వడంతోనే ఇప్పటికే యాక్టింగ్, డాన్స్ లో ట్రైనింగ్ తీసుకొని ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టి ఫిజికల్ అపీరియన్స్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.త్వరలో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఉండే అవకాశం ఉందని బోగట్ట.