బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా విజయవంతం కావాలంటే ఆ సినిమా వెనుక ఎంతోమంది టెక్నీషియన్లు, దర్శకనిర్మాతలు తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది.ఈ క్రమంలో సినిమా షూటింగ్ చేస్తూ ఉండటం వల్ల సినిమా సెట్లో ఎంతో మంది మధ్య పరిచయాలు ఏర్పడటం ఆ పరిచయాలు ప్రేమగా మారి ఆ ప్రేమ వివాహానికి దారితీయడం వంటివి సర్వ సాధారణంగా జరుగుతూనే ఉంటాయి.
ఇలా ఇండస్ట్రీకి చెందిన వారు ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము.సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీలు తమ కెరీర్ ను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరకడం నా అదృష్టం అని భావిస్తూ ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోయిన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు.మరి అలా సినిమా సెలబ్రిటీల పెళ్లి చేసుకున్న ఎవరు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
ఖుష్బూ -సుందర్ సి:
మొదటగా వీరిద్దరూ కలిసి మురై మమన్ చిత్రంలో నటించారు.ఈ చిత్రం ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.ఈ ప్రేమ విషయాన్ని సుందర్ కుష్బూతో చెప్పగా అనంతరం ఒక ఏడాదికి వీరిద్దరి వివాహం జరిగింది.
శరణ్య – పొన్వన్నన్:
వీరిద్దరు కలిసి ఎన్నో చిత్రాలకు పని చేశారు.ఇండస్ట్రీలో ఈమె పనితీరుకు మంత్ర ముగ్ధుడైన పొన్వన్నన్ ఆమెను ప్రోత్సహిస్తూ ఉండేవాడు.ఇలా వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించుకోవడం మొదలు పెట్టారు.ఇలా ఒకరోజు ఫోన్లో నువ్వు నాతో జీవితం పంచుకుంటావా అని పొన్వన్నన్ అడిగినప్పుడు పదిరోజుల తర్వాత ఈమె తన ప్రేమకు అంగీకారం తెలిపింది.
దేవయాని -రాజ్ కుమార్:
సూర్యవంశం సినిమా షూటింగ్ లో ఏర్పడిన పరిచయం ఏర్పడి ఈ పరిచయం కాస్తా విన్నుక్కుం మన్నుక్కుం సినిమా తీసే సమయానికి ప్రేమగా మారింది.ఇలా వీరి ప్రేమ పెళ్లికి దారితీసింది.అయితే వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో గుళ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
రమ్యకృష్ణ – కృష్ణవంశీ:
చంద్రలేఖ సినిమా ద్వారా పరిచయం ఏర్పడిన అనంతరం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.ఇలా ఎనిమిది సంవత్సరాల ప్రేమ అనంతరం పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
నయనతార – విగ్నేష్ శివన్:
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార ‘‘ నాన్ రౌడీ దాన్’’ ఈ సినిమా ద్వారా పరిచయం ఏర్పడింది.నయనతార అందరితో కలుపుగోలు తనం చూసిన విగ్నేష్ నయనతార ప్రేమలో పడ్డాడు.త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.