సినీ నటి, మాజీ కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ సుందర్ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తుంది.నేడు ఆమె బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.
ఈ సమయంలో ఆమెకి కాంగ్రెస్ అధిష్టానం భారీ షాక్ ఇచ్చింది.ఖుష్బూ సుందర్ ను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ తొలగించింది.
ఆమె కాంగ్రెస్ ప్రాధమిక సభ్యురాలికి రాజీనామా చేసి, ఈ రోజు మధ్యాహ్నం బీజేపీలో చేరనుంది.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆమె బీజేపీలో చేరతారు.
కాసేపటి క్రితం ఆమె కాంగ్రెస్ నుంచి తప్పుకున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
సినిమాల ద్వారా దక్షిణాదిన మంచి గుర్తింపు , పేరు సంపాదించుకున్న ఖుష్బూ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు.కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికారిక ప్రతినిధిగా పనిచేసిన ఖుష్బూ గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇటీవలే కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యాపాలసీని సమర్ధించారు.దీంతో కాంగ్రెస్ పార్టీ ఖుష్బూపై సీరియస్ అయ్యింది.
అప్పటి నుంచే ఖుష్బూ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి.తాజాగా, ఖుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీకి షాక్ ఇచ్చింది.
పార్టీకి రాజీనామా చేసిన ఖుష్బూ నేటి మధ్యాహ్నం బీజేపీలో చేరబోతున్నారని సమాచారం.ఖుష్బూ రాకతో తమిళనాడు బీజేపీకి కొత్త గ్లామర్ వచ్చినట్టే అని చెప్పాలి.
ఇక , 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉంది అన్నాడీఎంకే.
మరోవైపు ఈసారి ఎలాగైనా గెలవాలని డీఎంకే కృతనిశ్చయంతో ఉంది.డీఎంకే, కాంగ్రెస్ కలసి కట్టుగా ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
అన్నాడీఎంకే, బీజేపీ కలసి బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది.