తెలుగు సినీ నటి ఖుష్బూ.తెలుగులో కాకుండా తమిళ భాషలో కూడా నటించింది.
నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా బీజేపీ పార్టీలో చేరింది.చాలా సినిమాలలో నటించిన ఈమె తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అంతేకాకుండా తన వ్యక్తిగత పట్ల కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఇక తమిళంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.అంతే కాకుండా హిందీలో కూడా నటించింది.
1986లో వెంకటేష్ నటించిన కలియుగ పాండవులు సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఆ తర్వాత పలు భాషలలో చాలా సినిమాలలో నటించగా తెలుగులో మాత్రం కొన్ని సినిమాలలో నటించింది.అంతేకాకుండా తెలుగు స్టార్ హీరోల సరసన కూడా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీకు దూరంగా ఉండగా మళ్లీ 2006లో స్టాలిన్ సినిమాలో ఎంట్రీ ఇచ్చి చిరంజీవికి అక్కగా నటించింది.ఇక పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో కూడా పవన్ తల్లిగా బాగా మెప్పించింది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఖుష్బూ.నిత్యం తన ఫోటోలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఇప్పటికీ అందంలో ఎలాంటి మార్పులు లేవు.ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేసే పోస్టుల పట్ల పొరపాటు జరగడంతో బాగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఒకప్పటి తన ఫోటోను షేర్ చేసుకోగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.అందులో ఓ గిరిజన అమ్మాయిగా కనిపించిన కుష్బూ ఎంతో అందంగా కనిపించింది.
ఇక ఈ ఫోటోతో పాటు ప్రస్తుతం దిగిన ఓ ఫోటోని షేర్ చేయగా ఈ రెండింటి ఫోటోలకు తేడా ఏంటో తెలిపింది.ఇక ఆ ఫోటో 1983లో దిగగా అప్పుడు తను 13 ఏళ్ళ వయసులో ఉన్నా అంటూ అప్పుడు అమాయకంగా ఉంటూ ఇప్పుడు స్ట్రాంగ్ ఉమెన్ గా ఉన్నానని తెలిపింది.