తీవ్ర డిప్రెషన్ కు గురైన బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించడం దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ ఘటనపై స్పందించిన కోర్టు గతంలో తాను కూడా డిప్రెషన్ కి లోను అయ్యాను అని చెప్పుకొచ్చింది .
ఆ సమయంలో తాను కూడా చనిపోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది కుష్బూ.
అయితే ప్రతి మనిషి జీవితంలో సమస్యలు, క్లిష్ట పరిస్థితులు ఉంటాయని వాటిని అధిగమించాలి ఆత్మహత్య చేసుకోవద్దు అంటూ పేర్కొంది.
ఒకానొక దశలో తన జీవితం స్తంభించిపోయి తానుకూడా డిప్రెషన్లోకి వెళ్లాను అంటూ చెప్పుకొచ్చిన కుష్బూ..ఈ సమస్యలు ఒత్తిడిల కంటే శాశ్వత నిద్రలోకి వెళ్ళడం ఎంతో మేలు అనుకున్నాను తెలిపింది .కానీ తనలో ధైర్యం ఇలాంటి ఆలోచనల నుంచి బయటకు లాగిందని… ఈ సమస్యల కంటే విలువైన జీవితమే ఎంతో ముఖ్యం అని అర్థం చేసుకున్న అంటూ చెప్పుకొచ్చింది ఖుష్బూ.
తన బాధలను వెంటనే వెనక్కి నెట్టి ఒక్క అవకాశం కోసం ఎదురు చూశాను… ఆ రోజు కఠినంగా నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈ రోజు ఈ స్థితిలో ఉండ గలిగాను అంటూ చెప్పుకొచ్చింది.తాను ఎప్పుడూ పరాజయాలను చూసి భయపడ్డం గానీ వెనకడుగు వేయడం గానీ చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది ఖుష్బూ.
పరాజయాలను అధిక నుంచి విజయం వైపు ధైర్యంగా అడుగులు వేయడం ఎలాగో నేర్చుకున్నాను అంటూ తెలపింది .ఇక కుష్బూ మాటలు ఎంతోమందిలో స్ఫూర్తిని నింపాయి అని అంటున్నారు నెటిజన్లు
.