ఈ మధ్యకాలంలో మహిళల మోసాలు భాగా ఎక్కువ అయిపోతున్నాయి.అమ్మాయిలని అబ్బాయిలు ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో, అంతే దారుణంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలని ప్రేమ పేరుతో వలలో వేసుకొని నిలువుదోపిడీ చేసి మోసాలకి పాల్పడుతున్నారు.
అయితే ఇలా అమ్మాయిల చేతిలో మోసపోయిన మగవారిలో ఎక్కువ మంది బయటకి రాకపోవడంతో వారి భాగోతాలు ప్రపంచానికి తెలియడం లేదు.తాజాగా తమిళనాడులో జరిగిన ఓ సంఘటన అమ్మాయిలు మగవారిని ఎంత ఈజీగా మోసం చేస్తారో పరిచయం చేసింది.
ఓ అమ్మాయి ఒకరికి తెలియకుండా ఒకరిని అలా ఏకంగా 17 మంది యువకులని పెళ్లి చేసుకుందాం అంటూ మోసం చేసి డబ్బులు కాజేసింది.కడలూరు జిల్లాకి చెందిన ఓ వ్యాపారి పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉండగా మ్యాట్రిమొనీ నుంచి ఓ అమ్మాయి కాల్ చేసి అతనిని కలుసుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్పి తరువాత తన ఆర్ధిక కష్టాలు చెప్పింది.
అతను కరిగిపోయి ఆమెకి ఆర్ధిక సాయం చేసాడు.తరువాత అతను పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతి సారి ఏవో సాకులు చెబుతూ తప్పించుకునేది.ఇక అతను అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుందామని వెళ్ళగా అది అమ్మాయిని ప్రేమిస్తున్న మరో యువకుడు ఇళ్ళు అని తెలిసింది.దాంతో మోసపోయామని అర్ధం చేసుకున్న ఇద్దరు.
ఓ రౌడీని ఆశ్రయించగా అతని అమ్మాయి లోబరుచుకొని తిరిగి వాళ్ళిద్దరిని బెదిరించింది బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు.దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బాధితుడు పోలీసులని ఆశ్రయించగా.
ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా ఆ అమ్మాయి అలాగే చాలా మంది యువకులని మోసం చేసిందని గ్రహించారు.ఆమె మొబైల్ లో చాలా మంది అబ్బాయిలతో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు ఉండటం చూసి షాక్ అయ్యారు.
ఇలా సుమారు 17 మందిని పెళ్లి పేరుతో మోసం చేసి కోటి రూపాయిల వరకు ఆ అమ్మాయి నొక్కేసింది అని పోలీసులు గుర్తించారు.