టాలీవుడ్ మాస్ మహారాజగా పేరు తెచ్చుకుని ఏడాదికి నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తాడు రవితేజ.అయితే గత కొన్ని రోజులుగా ప్లాప్ సినిమాలతో బాధ పడుతున్న రవితేజ ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజైన క్రాక్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.
తన కెరీర్ కు కీలకంగా మారిన క్రాక్ సినిమా హిట్ అవ్వడంతో రవితేజ ఫుల్ ఖుషీగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత రవితేజ వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్ నుండి మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాలో అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు.అంతేకాదు అనసూయ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడడంతో మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి.
రవితేజ ఖిలాడీ షూటింగ్ కూడా త్వరలోనే రీస్టార్ట్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే 90 శాతం పూర్తి చేసుకున్న ఖిలాడీ సినిమా ఇంకా మిగిలిన బాలన్స్ షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేసి థియేటర్స్ ఓపెన్ అవ్వగానే విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.లేటెస్ట్ సమాచారం ప్రకారం.ఈ సినిమా షూటింగ్ ను దుబాయ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఒక చిన్న షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసి ఆ తర్వాత కొన్ని కీలకమైన సన్నివేశలను తెరకెక్కించేందుకు దుబాయ్ ను ఎంచుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.