టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ చేస్తున్న కొత్త చిత్రాల్లో ఖిలాడీ ఒకటి.రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా తెరకెక్కుతుంది.
మధ్యలో కరోనా కారణంగా వాయిదా పడిన కూడా షూటింగ్ శరవేగంగా జరిగింది.మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ అర్ధాంతరంగా నిలిచి పోయింది.
అయితే ఈ సినిమా షూటింగ్ గురించి లేటెస్ట్ ఒక వార్త వినిపిస్తుంది.
ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజైన క్రాక్ సినిమాతో రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.
ఈ సినిమా హిట్ తన కెరీర్ కు కీలకం అవ్వడంతో కథ సెలక్షన్ జాగ్రత్తగా చేసి సూపర్ హిట్ కొట్టాడు.క్రాక్ హిట్ తో వరస పెట్టి సినిమాలు చేస్తూ మంచి జోరు మీద ఉన్నాడు.
ఖిలాడీ సినిమా షూటింగ్ మొన్నటి వరకు ఇటలీలో శరవేగంగా జరిగి ఆ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
అయితే తాజాగా కరోనా తర్వాత ఇంత వరకు ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అవ్వలేదు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.మరొక రెండు రాజుల్లో అంటే జులై 26 న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారని మేకర్స్ చెప్పారు.
ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ రమేష్ వర్మ.
ఈ సినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో విలన్ గా అర్జున్ నటిస్తుండగా.అనసూయ కూడా కీలక పాత్రలో నటిస్తుంది.
దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.