భాగ్యనగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ తయారీ కాస్త ఆలస్యం కానుంది.చవితికి రెండు రోజుల ముందు మాత్రమే ఈ సారి దర్శనం ఇవ్వనున్నాడు.
ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ మహా గణపతి ప్రస్థానం.ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఏడాదికో అడుగు పెరుగుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు.
ఈసారి 68 వ సంవత్సరం సందర్భంగా శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా 50 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఈ క్రమంలో విగ్రహా తయారీ పనులను ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు.
శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో విగ్రహం రూపుదిద్దుకోనుండగా.పాముపై కమలం పువ్వులో నిలబడి ఉన్న మహా గణపతికి కుడివైపు లక్ష్మీదేవి, ఎడమ వైపు మూషికం ఉండనున్నాయి.
అదేవిధంగా ఐదు తలలపై పాము పడగ, ఆరు చేతులతో మహా గణపతి ఈ సారి భక్తులను దర్శనమిస్తారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.