కన్నడ సెన్షేషనల్ మూవీ కేజిఎఫ్ 2 షూటింగ్ మొన్నటి వరకు బెంగుళూరులో జరిగింది.అక్కడ షూటింగ్ ముగించుకున్న తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇక హైదరాబాదులో షూటింగ్ కి రెడీ అవుతున్నట్లు ప్రకటించారు.
అన్నట్లుగానే దర్శకుడు ప్రశాంత్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా హీరో యష్ నేడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగాడు.ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లిన ఆయన రేపు లేదా ఎల్లుండి నుండి షూటింగ్ లో జాయిన్ అవ్వపోతున్నట్లుగా తెలుస్తోంది.
కేజిఎఫ్ 2 సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మొదటి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రెండవ పార్ట్ పై మరింత అంచనాలు ఉన్నాయి.
కే జి ఎఫ్ 2 సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేస్తుంది అన్నట్లుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఏ కన్నడ సినిమా కూడా 200 కోట్ల మార్క్ ను టచ్ చేయలేదు.
కానీ కే జి ఎఫ్ సినిమా అంతకు మించి వసూళ్లను సొంతం చేసుకుంది.జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిన యష్ హైదరాబాదుకు షూటింగ్ కోసం రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు.
ఎయిర్ పోర్టులో ఆయనను గుర్తు పట్టిన అభిమానులు సెల్ఫీలు తీసుకోవడం కోసం ముందుకు వచ్చారు.అయితే ఆయన మాత్రం కరోనా కారణంగా అక్కడ ఎవరితో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
మాస్క్ ఉండడం వల్ల కొద్ది మంది ఆయన్ని గుర్తు పట్టలేకపోయారు.కానీ ఎక్కువ శాతం మంది ఆయన్ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో గుర్తించి ఫోటోలకు ఎగబడ్డారు.
యష్ కేజిఎఫ్ 2 తర్వాత తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఒకవేళ తెలుగులో ఆయన సినిమా చేస్తే ఇక్కడ మరింతగా ఆయన పాపులారిటీ పెరగడం ఖాయం.