కన్నడలో చాలా సినిమాల్లో నటించినా కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల ద్వారానే యశ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు.కరోనా, లాక్ డౌన్ వల్ల ఎంతోమంది కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే.
ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని అందరికీ సాయం చేయలేకపోయినా ఆకలితో అలమటిస్తున్న సినీ కార్మికులకు సాయం చేయడానికి యశ్ ముందుకు రావడం గమనార్హం.
కన్నడ సినీ పరిశ్రమకు సంబంధించిన 21 డిపార్టుమెంట్ లకు చెందిన 3,000 మందికి ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున సాయం చేస్తున్నట్టు యశ్ ప్రకటన చేశారు.
యశ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.తాను కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచి ఈ మొత్తాన్ని ఇచ్చానని యశ్ అన్నారు.తాను చేసిన సాయం వల్ల శాశ్వత పరిష్కారం దొరకదని యశ్ పేర్కొన్నారు.త్వరలోనే మంచి రోజులు వస్తాయని భావిస్తున్నానని యశ్ అన్నారు.
లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో ఇండస్ట్రీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్లు కష్టాలు పడుతున్నారు.కడుపు నిండా అన్నం దొరకక ఇబ్బందులు పడుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఇలాంటి సమయంలో యశ్ చేసిన సాయాన్ని ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా యశ్ హీరో అనిపించుకుంటున్నారు.
చాలామంది స్టార్ హీరోలు సాయం చేస్తున్నా యశ్ స్థాయిలో మాత్రం సహాయం చేయడం లేదు.యశ్ ఈ సహాయం ద్వారా తన గొప్పమనస్సును చాటుకున్నారు.మరోవైపు యశ్ నటిస్తున్న కేజీఎఫ్ 2 టీజర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.ఈ టీజర్ కు ఏకంగా 188 మిలియన్ల వ్యూస్, ఎనిమిది లక్షల కంటే ఎక్కువగా లైక్స్ రావడం గమనార్హం.
ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా నిడివి మూడు గంటల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.