మరో పాన్ ఇండియా సినిమాని ఎనౌన్స్ చేసిన కేజీఎఫ్ నిర్మాతలు

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్.మొదటి సినిమానే కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ నిర్మాతలు ఇప్పుడు కేజీఎఫ్ 2ని అంతకు మించిన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

 Kgf Makers Hombale Films Line Up Another Indian Film, Tollywood, Bollywood, Kgf2-TeluguStop.com

ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ప్రశాంత్ నీల్ మరింత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరపై ఆవిష్కరిస్తున్నారు.

సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ స్టార్ ఇందులో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే హోంబలే ఫిలిమ్స్ నిర్మాతలు నెక్స్ట్ మరో పాన్ ఇండియా సినిమాకి సిద్ధం అవుతున్నారు.

దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు.ఈ సినిమాని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నట్లు స్పష్టం చేశారు.

పునీత్ రాజ్ కుమార్ తో యువరత్న అనే సినిమాని హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది.ఈ సినిమా తెలుగు, కన్నడ బాషలలో రిలీజ్ అవ్వబోతుంది.ఇదిలా ఉంటే తమ ప్రొడక్షన్ హౌస్ నుంచి డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాలకు పాన్ ఇండియా మూవీకి సంబందించిన వివరాలు వెల్లడించనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.అయితే ఈ సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఉంటుందని టాక్ నడుస్తోంది.

కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ నీల్, డార్లింగ్ ప్రభాస్ ని కలిసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కథ విషయం చర్చించినట్లు టాక్ వినిపిస్తుంది.

ఇప్పుడు ఇదే సినిమాకి సంబంధించి డిసెంబర్ 2న అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube