కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసిన కేజీఎఫ్ చిత్రం కన్నడతో పాటు, తెలుగు, హిందీ భాషల్లో అదిరిపోయే సక్సెస్ను అందుకుంది.
ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రావడంతో మాస్ వర్గాలు పూర్తిగా కనెక్ట్ అయ్యారు.ఇక ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు సీక్వెల్ను కూడా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం, భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుండటంతో కనీసం టీజర్ అయినా రిలీజ్ చేస్తారేమోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ సమయంలో ఈ టీజర్ రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.
కానీ ఇప్పట్లో ఈ సినిమా టీజర్ రాదని చిత్ర నిర్మాత తెలిపాడు.ఈ సినిమా టీజర్ను అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే రిలీజ్ చేస్తామని వారు తెలిపారు.
దీంతో కేజీఎఫ్ 2 టీజర్పై ప్రేక్షకులు ఆశలు వదులుకున్నారు.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
యశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు.