కన్నడ, తెలుగు భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదలై సంచలన విజయం సాధించింది కేజీఎఫ్.కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ గా కేజీఎఫ్ 2 తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి ఈ సినిమా వల్ల ఏడు సినిమాలు కోల్పోయాయని చెబుతున్నారు.కేజీఎఫ్ సినిమాలో నటించినా నటి శ్రీనిధి శెట్టికి ఆశించిన స్థాయిలో పేరు రాలేదు.
కేజీఎఫ్ లో హీరోగా నటించిన యశ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రాగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కింది.యశ్ సినిమాలకు మార్కెట్ పెరగగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.అయితే హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టికి కూడా ఆఫర్లు బాగానే వచ్చినా కరోనా, లాక్ డౌన్ వల్ల కేజీఎఫ్ 2 షెడ్యూల్ లో మార్పులు జరగడంతో నష్టపోయానని శ్రీనిధి చెబుతున్నారు.
లాక్ డౌన్ తనకు చాలా నష్టం చేసిందని శ్రీనిధి పేర్కొన్నారు.
కేజీఎఫ్ పార్ట్ వన్ తరువాత కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినా కేజీఎఫ్ 2 సీక్వెల్ వల్ల ఆ సినిమాల్లో నటించడం వీలు కాలేదని ఆమె పేర్కొన్నారు.తాను మిస్ చేసుకున్న సినిమాలలో మూడు కన్నడ సినిమాలు, రెండు తమిళ సినిమాలతో పాటు రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.
కేజీఎఫ్ 2 విడుదలైన తరువాత శ్రీనిధి వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.కేజీఎఫ్ 2 తర్వాత స్టార్ హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి గుర్తింపు తెచ్చుకుంటారేమో చూడాల్సి ఉంది.
కేజీఎఫ్ 2 భారతీయ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.ఈ సినిమా తెలుగు హక్కులు 60 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.