మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాంచరణ్ నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కుతున్నాన్ ఈ సిన్నిమాని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషలలో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది అనేది అందరికి తెలిసిందే.అలాగే ఈ సినిమాలో అమితాబచ్చన్ తో పాటు, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ నటులు కూడా నటిస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో తమన్నా ఓ కీలక పాత్రలో కనిపిస్తూ ఉండగా, నయనతార హీరోయిన్ గా చేస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ గురించి టాలీవుడ్ లో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.
అక్టోబర్ 2 న ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇదిలా ఉండగా సైరా చిత్రం హిందీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ రేటుకు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే జీఎఫ్ సినిమాని హిందీలో రిలీజ్ చేసి భారీగా లాభాలు సొంతం చేసుకున్న ఈ సంస్థ ఇప్పుడు సైరా నరసింహారెడ్డి మీద భారీగా పెట్టుబడి పెట్టి హక్కులు సొంతం చేసుకుందని సమాచారం.