ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి ఎవరూ ఊహించని విధంగా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
ఇక ఇలాంటి అద్భుతమైన సినిమాని విడుదల చేసిన తర్వాత ఈ సినిమాకి మరో సీక్వెల్ ఉంటుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ గురించి ప్రశ్నలు రావడంతో ఈ విషయంపై చిత్రబృందం స్పందించి కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా గురించి ప్రకటించినప్పటికీ ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది అని చాలా మంది భావించారు.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అదేవిధంగా ఎన్టీఆర్ తో కూడా మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.ఈ క్రమంలోనే కేజిఎఫ్ చాప్టర్ 3 మరింత ఆలస్యం అవుతుందని భావించారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా కేజిఎఫ్ చాప్టర్ 3 షూటింగ్ ఈ ఏడాది ప్రారంభం కానుందని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ నెలలో షూటింగ్ పనులను ప్రారంభించనుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే అదే సమయంలో ఎన్టీఆర్ తో కూడా సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు గతంలో ప్రశాంత్ నీల్ వెల్లడించారు.అయితే ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ 3 గురించి ఈ వార్తలు రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.