సౌత్ ఇండియా నుంచి బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయిన మరో సినిమా కేజీఎఫ్.కన్నడ ఇండస్టీ నుంచి వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు సృష్టించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా సీక్వెల్ ప్రస్తుతం తెరకెక్కుతుంది.
మొదటి సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ మరింత గ్రాండ్ గా సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కేజీఎఫ్ 2 కోసం బాలీవుడ్ నుంచి సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి స్టార్ నటులని తీసుకొని వారిని సినిమాలో మెయిన్ విలన్స్ పాత్రలలో చూపిస్తున్నాడు.
ఇప్పటికే సంజయ్ దత్ చేస్తున్న అధీరా పాత్ర అలాగే రవీనా టాండన్ చేస్తున్న ప్రధానమంత్రి పాత్రలకి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.ఇవి సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ని ప్రశాంత్ నీల్ పూర్తి చేశాడు.
తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది.రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ని ప్లాన్ చేశారు.
హైదరాబాద్ షెడ్యూల్ తో షూటింగ్ కి ప్యాకప్ చెప్పేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ షూటింగ్ లో హీరో రాకీ భాయ్, విలన్ అధీరా పాత్రలకి సంబంధించి భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది.
దీని తర్వాత సినిమాకి గుమ్మడికాయ కొట్టేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నారు.వీలైనంత వేగంగా సినిమాని పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి లేదంటే వేసవి సీజన్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తుంది.
మరి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా మొదటి సినిమా తరహాలో అంచనాలని అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.