రాకింగ్ స్టార్ యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్.ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఈ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కేజీఎఫ్2 షూటింగ్ చివరి అఖంలో ఉంది.ఇక ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
ఈ సారి మరింత భారీ బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ ఈ సినిమాని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.అధీరా పాత్రలో సంజయ్ దత్ ని పరిచయం చేయడం ద్వారా ఈ సారి బాలీవుడ్ మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు ఉన్నాడు.
ఈ సారి నాన్ బాహుబలి రికార్డులని సౌత్ లో కేజీఎఫ్2 పేరు మీదకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు.దేశ వ్యాప్తంగా మోస్ట్ ఏవైటింగ్ మూవీగా ఉన్న ఈ సినిమా టీజర్ రిలీజ్ కి చిత్ర యూనిట్ డేట్ ఫిక్స్ చేసింది.
ఇక టీజర్ రిలీజ్ డేట్ ని రివీల్ చేయడంలో ప్రశాంత్ నీల్ తన క్రియేటివిటీకి పదును పెట్టారు. కేజీఎఫ్ టైమ్స్ అనే పత్రికలో రాఖీభాయ్ గురించి ప్రత్యేకంగా ఫస్ట్ పేజ్ ఆర్టికల్ వచ్చింది.అందులో హీరోనా? విలనా? అనే హెడ్ లైన్ వాడి ప్రత్యేకంగా కథనం రాసినట్లు పోస్టర్ డిజైన్ చేశారు.అందులో సారాంశం మొత్తం రాఖీభాయ్ గురించే ఉంది.
ఆ పోస్టర్ పై జనవరి 8న రివీల్ చేయబోతున్నట్లు ఒక స్టాంప్ ముద్ర వేశారు.ఇలా వినూత్నంగా టీజర్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయడంతో ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ పోస్టర్ తో సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అయ్యింది.ఎంత హైప్ క్రియేట్ అయితే అంత సక్సెస్ అవుతుందనే ఉద్దేశ్యంతో కేజీఎఫ్2కి సంబంధించి ప్రతి అప్డేట్ ని వీలైనంత వరకు యూనిక్ గా జనంలోకి తీసుకొస్తున్నారు.
ఈ టీజర్ రిలీజ్ కి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.
.