ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.రిలీజ్ అయిన అన్ని బాషలలో సినిమా అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
తెలుగులో కూడా ఈ మూవీ ఏకంగా 25 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టింది అంటే అది కంప్లీట్ గా సినిమా కంటెంట్ కి దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ విజన్ కారణం అని చెప్పాలి.ఇక ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ కూడా రిలీజ్ కి రెడీ అయ్యింది.
మొదటి పార్ట్ ని మించి ఈ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరపై ఆవిష్కరించాడు.బాలీవుడ్ కల్నాయక్ సంజయ్ దత్ ని ఈ మూవీలో అధీరా పాత్ర కోసం ఎంపిక చేశారు.
ఇక రవీనా టాండన్ ప్రధాన మంత్రి పాత్రలో కనిపించబోతుంది.ఇదిలా ఉంటే మొదటి సినిమా హిట్ కారణంగా చాప్టర్ 2 మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
దానికి తగ్గట్లుగానే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ ని వదిలి మరింతగా హైప్ క్రియేట్ చేశాడు.ఇప్పుడు ఈ మూవీ మరో అరుదైన ఫీట్ ని అందుకుంది.ఏకంగా 188 మిలియన్ వ్యూస్ ని కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ క్రాస్ చేసింది.అలాగే 8 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీజర్ గా గుర్తింపు దక్కించుకుంది.
అలాగే పది లక్షల కామెంట్స్ సాధించిన చిత్రంగా కూడా ఈ టీజర్ ఘనత దక్కించుకుంది.ఈ స్థాయిలో టీజర్ కి స్పందన వచ్చింది అంటే సినిమాపై ఈ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
కచ్చితంగా కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ సారి బాలీవుడ్ వంద కోట్ల మార్కు కలెక్షన్ ని దాటడం పక్కా అనే మాట ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తుంది.అయితే కరోనా సెకండ్ వేక్ లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ రిలీజ్ ని వచ్చే వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తుంది.