కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజీఎఫ్.ఈ సినిమా దేశ వ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యింది.
కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేయడంతో పాటు, అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాగా కూడా రికార్డులు క్రియేట్ చేసింది.కన్నడ ఇండస్ట్రీకి పరిమితం అయిన రాకింగ్ స్టార్ యష్ ని యూనివర్శల్ హీరోగా ఈ సినిమా మార్చేసింది.
ప్రస్తుతం ఇతర బాషలలో దర్శకులు కూడా యష్ తో సినిమా చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.శంకర్ లాంటి దర్శకుడు యష్ డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదంతా కేజీఎఫ్ సినిమా అతనికి తీసుకొచ్చిన గుర్తింపు.ఇదిలా ఉంటే ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్ తెరకెక్కుతుంది.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. ఇందులో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తూ ఉండగా, మరో నెగిటివ్ రోల్ లో రవీనా టాండన్ కనిపించబోతుంది.అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలక పాత్రలో సందడి చేయబోతున్నాడు.
ఈ సారి మరింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.దానికి తగ్గట్లే అంచనాలు కూడా ఉన్నాయి.
ఈ నేపధ్యంలో అన్ని ఇండస్ట్రీలలో ఈ సినిమా రిలీజ్ రైట్స్ కోసం నిర్మాతలు పోటీ పడుతున్నారు.టాలీవుడ్ లో ఈ సినిమాని దిల్ రాజు సొంతం చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
దీనికోసం ౩౦ కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.అయితే మొదటి సినిమాని వారాహి బ్యానర్ లో సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు.
మరి ఈ సినిమా అతను తీసుకుంటాడా, దిల్ రాజు సొంతం చేసుకుంటాడ అనేది చూడాలి.ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిందని తెలుస్తుంది.
సంక్రాంతి ఫెస్టివల్ కానుకగా కేజీఎఫ్2ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నట్లు టాక్.కేజీఎఫ్ సంక్రాంతికి వస్తే స్ట్రైట్ తెలుగు సినిమాలు కూడా పోటీ నుంచి తప్పుకోవాల్సిందే.
లేదంటే ఆ సినిమా క్రేజ్ ముందు బోర్లా పడతాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.