ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యాష్ హీరోగా తెరకెక్కిన సినిమా కేజీఎఫ్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా దేశ వ్యాప్తంగా సుమారు ఏడు భాషలలో రిలీజ్ అయ్యి 200 కోట్లకి పైగా కలెక్షన్ సొంతం చేసుకుంది.
ఇక కన్నడంలోనే అత్యధికంగా వంద కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాగా కేజీఎఫ్ రికార్డ్స్ సృష్టించింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కేజీఎఫ్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
కేజీఎఫ్ ని స్వాదీనం చేసుకున్న తర్వాత దుబాయ్ మాఫియా మీద కన్నేసిన రాకీ తన ప్రస్తానం ఎలా కొనసాగించాడు అనేది ఈ సినిమాలో చూపించాబోతున్నారు.
ఇక ఈ సినిమాలో దుబాయ్ మాఫియా డాన్ అయిన అధీరా పాత్రని సస్పెన్స్ లో పెట్టిన దర్శకుడు ఇప్పటికే రివీల్ చేశాడు.ఇక ఇందులో సుస్మితా సేన్ ఇందిరాగాంధీ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.ఇక ఫస్ట్ లుక్ రేపు సాయంత్రం 5.45 నిమషాలకి విడుదల చేయనున్నారు.ఇదే సమయంలో రేపటి నుంచి సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టనున్నారు.ఈ సినిమాలో మొదటి భాగాన్ని మించి యాక్షన్ ఎలిమెంట్స్, గూస్ బాంబ్స్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది.