కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచారు.
రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.
ఏప్రిల్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.రిలీజ్ అయినా అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.
దీంతో ఇప్పుడు కేజిఎఫ్ మ్యానియా దేశాన్ని ఊపేస్తోంది అనే చెప్పాలి.పార్ట్ 1 ను మించి సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది.
దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏకంగా 1100 కోట్లు వసూళ్లను అందుకున్నట్టు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
ట్రిపుల్ ఆర్ కంటే ఎక్కువ రాబట్టి ఇండియాస్ టాప్ 3 సినిమాగా నిలిచింది.ఇక ఈ సినిమా ఇప్పుడు మరొక అరుదైన ఘనత అందుకుని మరొక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ రికార్డ్ విషయంలో మాత్రం టాప్ 1 గా నిలిచింది.దీంతో కెజిఎఫ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ ఆ రికార్డ్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.ప్రముఖ బుకింగ్ పోర్టల్ బుక్ మై షోలో కేజిఎఫ్ 2 సినిమా ఏకంగా 17 మిలియన్ టికెట్స్ అమ్ముడు పోయాయట.
ఈ రేంజ్ మరే సినిమా కూడా టికెట్స్ అమ్ముడు పోలేదు.చాలా బుకింగ్స్ అప్షన్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఒక్క బుక్ మై షోలోనే ఈ రేంజ్ లో అమ్ముడు పోవడం నిజంగా సంచలనం అనే చెప్పాలి.
ముందు ముందు కూడా ఏ స్టార్ హీరో అందుకోలేని గొప్ప రికార్డ్ క్రియేట్ చేసారు.