ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎంతో బిజీగా ఉన్నారు.బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం తాను చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కుతున్నాయి.
ఈ క్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నారు.అదేవిధంగా కేజిఎఫ్ వంటి సెన్సేషనల్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పనులను ప్రారంభించి రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.
అయితే ఈ సెన్సేషనల్ స్టార్స్ కాంబినేషన్లో రాబోతున్న సలార్ సినిమా గురించి తాజా వార్త వినిపిస్తోంది.
ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కేజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కేజిఎఫ్ లాంటి సెన్సేషనల్ సినిమాలో నటించిన శ్రీనిధికి మంచి క్రేజ్ ఉంది.
అయితే ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కోసం రాసుకున్న ప్రత్యేక పాటకి శ్రీనిధి అయితే కరెక్ట్ గా సరిపోతుందని భావించడంతో ఆమెను ప్రత్యేక పాటలో తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేజిఎఫ్ సినిమా ద్వారా హీరోయిన్ గా శ్రీనిధిని పరిచయం చేసి బ్లాక్ బాస్టర్ హిట్ ను ఇచ్చింది ప్రశాంత్ నీల్ కాబట్టి, ప్రశాంత్ నీల్ అడిగితే తన కాదనకుండా ఈ పాటలో చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే షూటింగ్ పనులు జరుగుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకోసమే ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట.కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రభాస్ ఈ సినిమానే కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా, అదే విధంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే
.