కన్నడలో తెరకెక్కిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్’ ఎలాంటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో ఒక్కసారిగా హీరో యశ్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు.
ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు పరుగులు పెట్టారు.కాగా ఈ సినిమా కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు ప్రశాంత్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమా కోసం తెలుగునాట కూడా అదిరిపోయే క్రేజ్ నెలకొనడంతో ఈ సినిమాను సొంతం చేసుకునేందుకు ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు భారీ ఆఫర్లు చిత్ర యూనిట్ ముందుంచుతున్నారట.కాగా ఈ సినిమా ఉత్తరాంధ్ర థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా రూ.16 కోట్ల ఆఫర్ రాగా, చిత్ర నిర్మాతలు రూ.20 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తంది.దీంతో రూ.18 కోట్లకు ఈ డీల్ క్లోజ్ అయినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
యశ్ పవర్ఫుల్ మాస్ యాక్టింగ్కు ప్రశాంత్ నీల్ అల్టిమేట్ టేకింగ్ తోడుకావడంతో ఈ సినిమా మరో రేంజ్లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టండన్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
మరి కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనే అంశం ఈ సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది.వేసవి కానుకగా ఈ సినిమాను అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.