కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయగా ఇది రిలీజ్ అయిన అన్ని భాషల్లో దుమ్ములేపింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను పూర్తి మాస్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సె్స్ అయ్యింది.ఇక ఈ సినిమా అందించిన సక్సెస్తో కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ను జూలై 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన నటిస్తున్న అధీరా పాత్ర పోస్టర్ను ఆరోజు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. యశ్ను పాన్ ఇండియా హీరోగా మార్చేసిన ఈ సినిమా సీక్వెల్ కూడా అదే రేంజ్లో సక్సెస్ కొడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మరి ఈ సినిమాలో అధీరా పాత్రలో సంజయ్ దత్ ఎలా ఉండబోతున్నాడో చూడాలి.ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
మరి యశ్ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో ప్రభంజనం సృష్టిస్తాడో లేడో చూడాలి.