కన్నడ చిత్రంగా వచ్చిన కేజీఎఫ్ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ చేయగా అది ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం, హీరో యశ్ యాక్షన్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఫలితంగా కేజీఎఫ్ చిత్రం కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ లాంటి భాషల్లో కూడా బ్లాక్బస్టర్ మూవీగా నిలిచింది.ఇక ఈ సినిమా అందుకున్న సక్సె్స్తో ఈ సినిమా సీక్వెల్ ‘కేజీఎఫ్ – చాప్టర్ 2’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ముగించుకున్న కేజీఎఫ్ 2 చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు.కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
ఈ సినిమాను జూలై 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఏదేమైనా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కేజీఎఫ్ చిత్ర సీక్వెల్ రిలీజ్ డేట్ అనౌన్స్ కావడంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రవీనా టండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
మరి కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రేయేట్ చేస్తుందో తెలియాలంటే జూలై 16 వరకు ఆగాల్సిందే.