కన్నడంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.బాహుబలి రేంజ్ మూవీ అంటూ కేజీఎఫ్ కు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
దాంతో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా.పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు.ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తే పాన్ ఇండియా సినిమా అవ్వడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.అందుకే టాలీవుడ్ తో పాటు అన్ని భాషల హీరోలు కూడా ఆయనతో సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రభాస్ తో సినిమా ను చేస్తున్న ప్రశాంత్ నీల్ తదుపరి ఎన్టీఆర్.ఆ తర్వాత రామ్ చరణ్.ఆ తర్వాత బన్నీ ఇలా పలువురు హీరోలను లైన్ లో పెట్టాడు.ఆ మద్య మహేష్ బాబుతో కూడా చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇంత మంది స్టార్ హీరోలు ఆయన వెంట పడుతున్నారు అంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.కాని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు అనుకుంటున్న దాని ప్రకారం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలకు సిద్దంగా ఉన్న కేజీఎఫ్ 2 మరియు ప్రభాస్ తో ప్రస్తుతం రూపొందుతున్న సలార్ సినిమా ల్లో ఏ ఒక్కటి నిరాశ పర్చినా కూడా ఆయనకు డేట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన తెలుగు స్టార్స్ ఆయన్ను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి.ఆయన డౌన్ ఫాల్ కూడా మొదలు అయినట్లే అంటున్నారు.ఒక వేళ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడితే మాత్రం ఖచ్చితంగా ఆయన తో సినిమాలు చేసేందుకు ఏ హీరో ముందుకు రాకపోవచ్చు అంటున్నారు.
ఒక వేళ రెండు సినిమాలు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ఆయన తో సినిమాలకు మరింత మంది స్టార్స్ ముందుకు వస్తారని అంటున్నారు.మొత్తంగా ప్రశాంత్ నీల్ కెరీర్ కేజీఎఫ్ 2 మరియు సలార్ సినిమాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.