కన్నడలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కేజీఎఫ్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ ఒక్క సినిమాతో హీరో యశ్ ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు.
మాస్ అంశాలను పీక్స్లో చూపించడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సక్సెస్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు.ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు కేజీఎఫ్ టీమ్. కాగా కేజీఎఫ్ అందించిన బ్లాక్బస్టర్ సక్సెస్తో ఈ సినిమాకు సీక్వెల్ను కూడా రెడీ చేస్తున్నారు చిత్ర యూనిట్.ఇప్పటికే ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో మరోసారి యశ్ తన బ్రాండ్ను క్రియేట్ చేయాలని చూస్తు్న్నాడు.
రాకీ భాయ్ పాత్రలో యశ్ యాక్టింగ్కు మాస్ ఆడియెన్స్ నీరజానం పట్టడం ఖాయమని, ఈ సీక్వెల్ చిత్రంలో ఆయన ఇమేజ్ మరో లెవెల్కు వెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాలో క్లైమాక్స్ ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఉండబోతుందట.
కేజీఎఫ్-2లో విలన్ అధీరాను రాఖీ భాయ్ మట్టుబెడతాడట.ఆ తరువాత దేశ ప్రధాని పాత్రలో నటిస్తున్న రవీనా టండన్ రాఖీ భాయ్ను తన సైన్యంతో మట్టుబెట్టిస్తుంది.
ఈ విధంగా కేజీఎఫ్-2లో రాఖీ భాయ్ చరిత్ర ముగుస్తుందని తెలుస్తోంది.కాగా తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ధనవంతుడిగా మరణించడంలో రాఖీ భాయ్ సక్సెస్ అవుతాడు.
మొత్తానికి కేజీఎఫ్ 2 క్లైమాక్స్తో ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ముగింపు పలకడం ఖాయమని తెలుస్తోంది.