కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో యశ్ అదిరిపోయే బ్లాక్బస్టర్ను సొంతం చేసుకున్నాడు.
కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ వంటి భాషల్లో ఈ సినిమాకు బంపర్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్స్లో ఒకటిగా నిలిచింది.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందనే విషయం తెలిసినప్పటి నుండి ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు.కాగా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
అయితే ఈ సినిమా క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో రాకీ భాయ్గా హీరో యశ్ తన ప్రత్యర్థులను చంపేసిన తరువాత కేజీఎఫ్ కింగ్గా మారుతాడు.
అయితే అతడి మాఫియా కార్యక్రమాల గురించి తెలుసుకున్న భారత ప్రభుత్వం అతడిని మట్టుబెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తుందట.ఈ మేరకు క్లైమాక్స్లో మనోడు పోలీసుల చేతిలో చనిపోతాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రవీనా టండన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.