ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఏసీబీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది.అనంతరం మెమో రిజెక్ట్ కు గల కారణాలను న్యాయస్థానం తెలిపింది.
కేసులో దర్యాప్తు చేయడానికి సిట్ కు అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది.ఏసీబీ మాత్రమే కేసును దర్యాప్తు చేయాలని వెల్లడించింది.
కేసులో ఉన్న ముగ్గురినీ నిందితులుగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది.