గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా దళిత గిరిజన దండోరా సభను గజ్వేల్ లో నిర్వహించాలా లేదా మెదక్ ప్రాంతానికి తరలించాలా అనే దానిపై చర్చిస్తున్నారు.
ఈ సభ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో నేతలంతా సమావేశమై ఒక తాటి పైకి రావటానికి గాంధీభవన్ లో భేటీ అయ్యారు.ఇదే క్రమంలో ఇప్పటికే హుజరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ బిజెపి పార్టీలు దూకుడుగా ఉండటంతో.
హుజురాబాద్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి ఎవరిని నుంచో పెడితే బాగుంటుంది అన్న దానిపై కూడా చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా సురేఖ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ కి చేరుకున్నారు.ఈ క్రమంలో ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ తో తాజా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న సమావేశంలో “దళిత గిరిజన దండోరా” సభ, అదే రీతిలో హుజురాబాద్ ఉప ఎన్నికలు గురించే ఎక్కువగా నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.