గాంధీభవన్ లో టీ కాంగ్రెస్ నాయకుల కీలక భేటీ..!!

గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా దళిత గిరిజన దండోరా సభను గజ్వేల్ లో నిర్వహించాలా లేదా మెదక్ ప్రాంతానికి తరలించాలా అనే దానిపై చర్చిస్తున్నారు.

 Key Meeting Of T Congress Leaders At Gandhi Bhavan Telangana,  Congress,  Revant-TeluguStop.com

ఈ సభ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో నేతలంతా సమావేశమై ఒక తాటి పైకి రావటానికి గాంధీభవన్ లో భేటీ అయ్యారు.ఇదే క్రమంలో ఇప్పటికే హుజరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ బిజెపి పార్టీలు దూకుడుగా ఉండటంతో.

హుజురాబాద్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి ఎవరిని నుంచో పెడితే బాగుంటుంది అన్న దానిపై కూడా చర్చలు జరుపుతున్నారు.

ఈ క్రమంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా సురేఖ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ కి చేరుకున్నారు.ఈ క్రమంలో ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ తో తాజా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న సమావేశంలో “దళిత గిరిజన దండోరా” సభ, అదే రీతిలో హుజురాబాద్ ఉప ఎన్నికలు గురించే ఎక్కువగా నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube