తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉన్నాయి.తెలంగాణలో ఇప్పటికే చాలావరకు కనుమరుగైపోయింది మరోపక్క ఇటీవల తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.
రమణ టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం తెలిసిందే.ఇదే రీతిలో ఏపీలో కూడా పరిస్థితి నెలకొని ఉన్నట్లు అర్థమవుతోంది.
దాదాపు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు హైదరాబాదుకి పరిమితం కావడంతో పాటు మరో పక్క జగన్ భారీగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉండటంతో… టిడిపిలో కీలక నేతలుగా ఉన్న చాలామంది దివ్యవాణి ఇంకా కొంతమంది నేతలు మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం గ్యారెంటీ అనే వ్యాఖ్యలు ఇటీవల చేయటం తెలిసిందే.
ఇటువంటి తరుణంలో ఏపీలో కూడా టిడిపి నేతలు పార్టీని వీడే పరిస్థితి లోకి వచ్చేశారు.విషయంలోకి వెళితే విజయనగరం జిల్లా మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి రాజీనామా లేఖను పంపడానికి సిద్ధమయ్యారు.మరోపక్క ఇప్పటికే వైసీపీ లో హైమావతి కూతురు స్వాతి కొనసాగుతూ ఉంది.హైమావతి గతంలో టిడిపి పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పని చేయడం జరిగింది.22 సంవత్సరాలుగా పార్టీలో ఉన్న హైమావతి తనని పార్టీ హైకమాండ్ దూరంగా పెట్టడం వల్లే పార్టీ వీడుతున్నట్లు స్పష్టం చేసింది.స్థానిక నాయకులు ఎవరూ కూడా తనకు సహకరించడం లేదని.ఏడాదికిపైగా పార్టీ కార్యక్రమాలకు కూడా తనని ఆహ్వానించడం లేదని ఈ విషయంపై పార్టీ పెద్దలతో మాట్లాడదామని అనుకున్న అవకాశం లేదని అందువల్లే తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు శోభాహైమావతి క్లారిటీ ఇవ్వడం జరిగింది.