ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నేడు సాయంత్రం జరిగింది.దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రధానంగా త్వరలో ప్రారంభం కాబోతున్న అమ్మఒడి పథకానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభం అయినట్లుగా క్యాబినెట్లో మంత్రులు తెలియజేయడం జరిగింది.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మరియు ఇతరత్ర విషయాల గురించి చర్చ జరిగింది.
గ్రామీణ ప్రాంతల్లో వ్యవసాయ పరిశోదన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని, జెరుసలేం వెళ్లే ప్రయాణికులకు ఇచ్చే ఆర్ధిక సాయంను కూడా పెంచేందుకు ఈ క్యాబినేట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
పలు కార్యక్రమాలను త్వరలో ప్రారంభించబోతున్నట్లుగా క్యాబినెట్లో ముఖ్యమంత్రి మంత్రులకు వెళ్లడించాడు.మంత్రుల సలహాలు మరియు సూచనలతో మీటింగ్ సుదీర్ఘంగా సాగినట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.