బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆరోపించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని విమర్శించిన కోమటిరెడ్డి కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని ఎద్దేవా చేశారు.అనంతరం గవర్నర్ తమిళిసైను కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ క్రమంలో ఆయన వెంటనే గవర్నర్ కు క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.