ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ గిట్టనివాళ్లు దుష్ఫ్రచారం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు.ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఈ తరహా అభివృద్ధి జరగలేదని చెప్పారు.

 Key Comments Of Ap Cm Jagan-TeluguStop.com

గ్రోత్ రేటులో దేశానికి ఏపీ దిక్సూచిగా నిలిచిందని తెలిపారు.మీ బిడ్డ చేస్తున్న అప్పుల గ్రోత్ రేట్ గతం కన్నా తక్కువేనన్నారు.

జగన్ పాలనలో బటన్ లు మాత్రమే ఉన్నాయని, లంచాలు, వివక్ష లేదని చెప్పారు.గత ముసలాయన ప్రభుత్వంలో గజదొంగల ముఠా ఉండేదని పేర్కొన్నారు.

గజ దొంగలకు దుష్టచతుష్టయం అనే పేరుందన్న జగన్ గజదొంగల ముఠా స్కీం డీపీటీనని అంటే దోచుకో.పంచుకో.

తినుకో అంటూ ఎద్దేవా చేశారు.ఈ నేపథ్యంలో గత పాలన కావాలా లేక లంచాల్లేని పాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని వెల్లడించారు.

తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారని విమర్శించారు.మీ బిడ్డకు పొత్తుల్లేవ్.

సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తాడని చెప్పారు.అందుకు కారణం మీ బిడ్డ నమ్ముకున్నది ప్రజలు, దేవుడిని అంటూ జగన్ వ్యాఖ్యనించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube