శీతాకాల సమావేశాల్లో సమయం వృధా చేయొద్దని కోరామని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు.జీ20 సదస్సులో ఏపీకి తగిన భాగస్వామ్యం కల్పించాలని కోరినట్లు వెల్లడించారు.ప్రతి పంటకు కనీస మద్ధతు ధర ఉండాలని సూచించామన్నారు.అదేవిధంగా కుల గణన జరిపించాలని కేంద్రాన్నికోరుతున్నామని పేర్కొన్నారు.అనంతరం ఆయన ఒక ప్రైవేట్ బిల్ పెడుతున్నట్లు చెప్పారు.విభజన చట్టంలో సవరణ తీసుకొస్తూ ప్రత్యేక హోదాను పొందుపర్చాలని కోరామన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సమయానుకూలంగా నిధులు ఇవ్వలని డిమాండ్ చేశారు.రైల్వే జోన్ తో పాటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖను తీసుకొస్తామని ఎంపీ భరత్ స్పష్టం చేశారు.