తెలంగాణలో రాహుల్ గాంధీ జోడో యాత్రలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.రూట్ మ్యాప్ లో మార్పులు చేస్తూ టీ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి నివేదిక పంపారు .
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది.శంషాబాద్ నుంచి అరాంఘర్, జూ పార్క్, చార్మినార్, ఎంజి మార్కెట్, నాంపల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, పటాన్ చెరువు మీదుగా ఈ యాత్ర కొనసాగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఈనెల 24న రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.రాష్ట్రవ్యాప్తంగా 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.అనంతరం మహారాష్ట్రకు చేరుకుంటుంది.